పోస్ట్‌లు

నెలరోజులు చిలకడదుంపలు తింటున్నారా????

చిత్రం
  నెలరోజులు చిలగడదుంపలు తిని చూడండి.. ఏమవుతుందో మీరే చెప్పండి! భూమిలో పండే అనేక ఆహారాలు మన శరీరానికి కావలసిన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అటువంటి ఆహారాలలో చిలకడదుంప ఒకటి. అయితే  చిలకడదుంపలను  ప్రతిరోజు క్రమం తప్పకుండా తినడం వల్ల మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు . నెలరోజులపాటు ప్రతిరోజు చిలకడదుంప తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. చిలకడ దుంపలతో బరువుకు చెక్ చిలకడదుంపలలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయని ప్రతిరోజు చిలకడదపలను మితంగా తీసుకుంటే అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు. చిలకడదుంపలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండి కడుపు నిండిన భావన కలిగిస్తుందని, ఇది అతిగా తినడాన్ని నివారిస్తుందని చెబుతున్నారు. బరువు తగ్గాలని భావించే వారికి చిలగడ దుంప గొప్ప ఆహారం అని చెబుతున్నారు. షుగర్ నియంత్రణకు చిలకడ దుంపలు అంతేకాదు చిలకడదుంపలలో ఉండే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణకు చిలకడదుం...

వేదవ్యాసునికి శుక్ర మహర్షి పుత్రునిగా ఎలా జన్మించేను

చిత్రం
వేదవ్యాసునకు శుక మహర్షి పుత్రునిగా ఎలా కలిగెను? వేదవ్యాసులు ఓ రోజు గంగానదీతీరాన స్నానానికి వెడుతూ ఓ పక్షులజంటను చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. అప్పుడే గ్రుడ్డులోంచి బయటకు వచ్చిన పిల్లలనోటికి ఎక్కడనుంచో తీసుకువచ్చిన ఆహారాన్ని అందిస్తున్నాయి పక్షులు. పిల్లలు ఎర్రటినోళ్ళతో కిచకిచమని అరుస్తున్నాయి. " ఎంత అద్భుతంగా ఉంది, పక్షులే సంసారంలోని మధురానుభూతులను ఇలా ఆనందిస్తూంటే మనుషులగురించి ఎక్కువ ఆలోచించవలసిన అవసరమేముంది " అని అనుకున్న వ్యాసులవారికి కూడా ఓ కొడుకును పొందాలనే కోరిక కలిగింది. శుకజననం జరిగింది. వ్యాసర్షి శుక్రుడిని కూడా పెళ్ళిచేసుకుని సంతానాన్ని పొందమంటారు. శుకుడు " ససేమిరా " అనడంతో జనకమహారాజు వద్దకు వెళ్ళి జీవిత సత్యం తెలుసుకోమంటారు. సరే అని శుకుడు వెళ్ళేసరికి జనకుడు సభా కార్యక్రమాలు చేస్తూంటారు. ఇంతగా మామూలు పనుల్లో మునిగిపోయిన ఈయనేం తత్త్వం చెబుతాడు అనుకుని శుకుడు వెళ్ళిపోతూంటాడు. అప్పుడు జనకుడు శుకుడిని పిలిచి కూర్చోబెట్టి విషయం తెలుసుకుని దూరంగా నృత్యప్రదర్శన జరుగుతూన్నచోట కాపలాగా ఉన్న భటుడిని పిలిపిస్తాడు. భటుడితో " అందరూ నృత్యాలు, కీర్తనలు అద్భుతంగా ఉన్న...

శ్రీలంక అనే పేరు అధికారకంగా ఎలా వచ్చింది

గుప్తుల కాలంలో, బహుశా క్రీ.శ. 4వ లేదా 5వ శతాబ్దంలో, సాకేత నుండి అయోధ్యగా పేరు మార్చబడింది."శ్రీలంక" అనే పేరు అధికారికంగా 1972లో దేశం రిపబ్లిక్‌గా మారినప్పుడు స్వీకరించబడింది, రామాయణం లో చెప్పిన అయోధ్య , లంక లు ఎక్కడ ఉన్నాయి? అత్రి మహాముని అగస్త్యునికి కార్తీక పురాణం చెప్పారు. దానిలో 21,22,23 అధ్యాయాలు పురంజనోపాఖ్యానం. పురంజన చక్రవర్తి రాజ్యానికి రాజధాని అయోధ్య. వశిష్టుడు " కార్తీకమాస వ్రతం చేసి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందమని " పురంజనుడికి సలహా ఇచ్చారు. రాజమహేంద్రవరం రాజమండ్రి అయి మళ్ళీ మన అదృష్టం కొద్దీ రాజమహేంద్రవరం అయింది. అలాగే లంక కొలంబో అయి శ్రీలంక అయింది. వారు మనలా కాదు, దేశభక్తులు. మళ్ళీ పూర్వనామంకి శ్రీ చేర్చి గౌరవించుకున్నారు. మనం విదేశీయులు పెట్టిన ఇండియా నామాన్నే కొనసాగించుకుందాం. విదేశీ భక్తిని ఎలుగెత్తి చాటుదాం. శుభమస్తు

రామాయణం రాయాలని రాజు రాయిపించుకుండా. అసలు కథ రామాయణం

చిత్రం
అయోధ్య లో రామాయణం రాయగలిగే ఋషులు లేరా అప్పట్లో? ఒక అప్పటి బందిపోటు అయిన వాల్మీకి కి ఆ అవకాశం వరించడం లో రాజ ఆజ్ఞ లో రహస్యం ఏమిటి ? రామాయణం అంటే ఎవరో రాజు డబ్బులిచ్చి రాయించుకున్న బయోగ్రఫీ / జీవిత చరిత్ర కాదు. ఓ రచయిత పనిగట్టుకు ఇంటర్వ్యూ చేసి రాయలేదు. రామాయణం రాయటానికి కావలసిన తపస్సు వాల్మీకి మహర్షి చేసారు. కొన్ని వందలు కాకపోతే కొన్ని వేల యేళ్ళు. తపస్సు చేసి హృదయానికి తగిన పవిత్రత చేకూర్చుకున్నా కానీ రామాయణం గురించి రాసే అవకాశం వారికి కలుగలేదు. ఒకనాడు శిష్యులతో కలిసి మధ్యాహ్న స్నానానికి వెళ్తే , ఒక బోయవాడు రెండు క్రౌంచపక్షులజంటలో ఒకదానిని పడగొడతాడు. అప్పుడు వాల్మీకి మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|   యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||   అంటారు. దానర్థం లౌకికంగా చూస్తే "వర్రె న్నీ బోయవాడా, కలిసి వున్న క్రౌంచపక్షులను కొట్టి చంపుతావురే, నువ్వు ఎక్కువ రోజులు బ్రతికి వుండవు ఫో!" అని. యదార్థంగా ఇదే అంటారు. దీనిని మరోలా మరోలా వివరించగలను కానీ, అవన్నీ అర్థం చేసుకునే బుఱ్ఱ మీకు వుందని నేను అనుకోవట్లేదు (ఈ ప్రశ్నను బట్టి). ఈ ప్రశ్నకు ఇంత matter చాలు. జరిగ...

ఇసుక నీపేశారు. ఆ గుడి కథ తెలుసుకోండి

చిత్రం
ఇసుక నింపేశారు.. వందేళ్ళ పాటు మూసేశారు.. ఇప్పుడు తెరుస్తున్నారు.. ఏమిటా గుడి కథ! ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వంద సంవత్సరాల పాటు ఆ గుడిని మూసేశారు. కనీసం అటువైపు ఎవరిని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ గుడిని భారత పురావస్తు శాఖ తెరవడానికి సిద్ధమవుతోంది. వంద సంవత్సరాల పాటు మూసివేసిన ఆ గుడిని ఇప్పుడు ఎందుకు తెరుస్తున్నారు.. ఇన్ని సంవత్సరాలపాటు ఎందుకు మూసివేశారు.. అందులో ఏమైనా రహస్యం ఉందా.. అనంత పద్మనాభ స్వామి ఆలయం మాదిరిగా నేల మాలిగలు ఏమైనా ఉన్నాయా?  ఆతీంద్రియ శక్తులు  ఏమైనా నిక్షిప్తమై ఉన్నాయా.. ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. మనదేశంలో పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. జాబితాలో ముందు వరుసలో ఉంటుంది కోణార్క్ సూర్య దేవాలయం. ఇక్కడ సూర్యుడికి నిత్యం విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. కోణార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దానికి చెందినది. ఈ అద్భుతమైన కట్టడం 1900 కాలం నాటికి పూర్తిగా బలహీనమైపోయింది. ఆలయం పైకప్పు నుంచి రాళ్లు ఊడి పడిపోయాయి. గోడలకు పగుళ్లు వచ్చాయి. దీంతో నాటి బ్రిటిష్ అధికారులు 1903 కాలంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆలయం కూలిపోకుండా ఉండడానికి లోపల భాగంలో ఇస...

విభీషణుడికి వినాయకుడి పరీక్ష.. పూర్తి కథ తెలుసుకోండి

చిత్రం
విభీషణుడికి వినాయకుడి పరీక్ష విభీషణుడికి వినాయకుడి పరీక్ష రామ రావణ యుద్ధంలో చివరకు రావణుడు హతమయ్యాడు. రావణుడి అంత్యక్రియల తర్వాత రాముడు విభీషణుడిని లంకకు రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ తర్వాత యుద్ధంలో తనకు సాయం చేసిన సుగ్రీవ ఆంజనేయ, అంగదాది వానర ప్రముఖులను, విభీషణుడిని వెంటబెట్టుకుని సీతా లక్ష్మణ సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు.అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది.పట్టాభిషేకం పూర్తయిన తర్వాత కొన్నాళ్లు రాముడి ఆతిథ్యం స్వీకరించిన వారంతా తమ తమ నెలవులకు తిరిగి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. యుద్ధంలో తనకు సహకరించిన వానర ప్రముఖులందరికీ రాముడు  స్వర్ణాభరణాలు  సహా అనేక విలువైన కానుకలను ఇచ్చి సాగనంపాడు.రావణుడికి సోదరుడై ఉన్నప్పటికీ, యుద్ధంలో తన పక్షాన నిలిచిన విభీషణుడికి సాగనంపేటప్పుడు ప్రత్యేకమైన కానుక ఇవ్వాలనుకున్నాడు. అందుకని తమ ఇలవేల్పు అయిన శ్రీరంగనాథుడి విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చాడు. విభీషణుడికి శ్రీరంగనాథుడి విగ్రహాన్ని అందిస్తూ, 'విభీషణా! ఇది మా ఇలవేల్పు శ్రీరంగనాథుడి విగ్రహం. నీ రాజ్యానికి శ్రీరంగనాథుడి అనుగ్రహం ఉండాలని దీనిని నీకు ఇస్తున్నాను. నీ ప్రయాణ...

రావణాసురుడిని బ్రాహ్మణుడు అని ఎందుకు అంటారు?

చిత్రం
రావణాసురుడిని బ్రాహ్మణుడు అని ఎందుకు అంటారు? 🕉️ రావణుడు వర్ణం ద్వారా బ్రాహ్మణుడు : ~ రావణుడు పులస్త్య మహర్షి మనవడు. పులస్త్య మహర్షి బ్రహ్మ యొక్క మానస పుత్రులలో ఒకరు - సప్తర్షులలో ఒకరు. ఇది రావణునికి బ్రాహ్మణ వంశం ఉన్నట్లు చూపిస్తుంది. ~ రావణుడి తండ్రి విశ్రవస్సు కూడా మహర్షి - పులస్త్యుని కుమారుడు. విశ్రవస్సు పండితుడు, తపస్వి, బ్రాహ్మణుడు. అతను వేద విద్యలో నిష్ణాతుడు.~ ప్రాచీన భారతీయ సంప్రదాయంలో పితృ వంశంద్వారా వర్ణం నిర్ణయించబడేది. కాబట్టి, రావణుడికి బ్రాహ్మణ వంశం వస్తుంది. 🕉️ రావణుడి బ్రాహ్మణ లక్షణాలు 🪔విద్వాంసుడు మరియు పండితుడు : రావణుడు అసాధారణ పండితుడు. అతను నాలుగు వేదాలు, షడ్దర్శనాలు, 64 కళలు నేర్చుకున్నాడు. తన కాలంలో అత్యంత విద్వాంసుడుగా పేరు పొందాడు. 🪔శివతాండవ స్తోత్రం : రావణుడు రచించినదని భావిస్తారు. ఇది అతని వేద విద్య, సంస్కృత పాండిత్యాన్ని చూపిస్తుంది. 🪔జ్యోతిష్యం, ఆయుర్వేదం, రాజనీతి, సంగీతం, యుద్ధ విద్యలు అన్నింటిలో నిష్ణాతుడు. "రావణ సంహిత" అనే జ్యోతిష్య గ్రంథం అతను రచించినట్లు చెప్తారు. 🪔బ్రాహ్మణ తపోగుణం : రావణుడు ...